హైదరాబాద్: HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. తాజాగా, G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకుని మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు బొల్లోజు శ్యామ్ కుమార్ పాల్గొని మానవ హక్కులు, సమాచార హక్కు, మత్తుపదార్థాల నివారణ వంటి అంశాలపై చర్చించనున్నారు.
అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధిగా…
HRC RTI ట్రస్ట్ గతంలో పలు అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని సమాజ సేవలో తన కృషిని చాటుకుంది:
✅ ఐక్యరాజ్యసమితి (UNO) సమావేశం – బ్యాంకాక్ (UNCC): మానవ హక్కుల పరిరక్షణపై చర్చ.
✅ ఆసియన్-జర్మనీ వర్క్షాప్ (ASEAN-Germany Workshop on Human Rights at Sea): సముద్ర హక్కులపై చర్చల్లో భాగస్వామ్యం.
✅ G20 (C20) సమ్మిట్:
భువనేశ్వర్, ఒడిశా: లింగ సమానత్వం & వికలాంగుల హక్కులు.
త్రివేండ్రం, కేరళ: విద్య & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్.
✅ UNPP – PSEA ప్రోగ్రామ్ పూర్తి చేశారు.


